తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు.. ఆరుట్ల టీపీఎస్ తరహాలో.. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే సౌకర్యాలు..!

Date:

ప్రభుత్వ ఉద్యోగం కావాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి, సర్కారు బడుల్లో పిల్లలను చదివించడానికి వెనుకాడుతుంటారు. సౌలతులు ఉండవని, పాఠాలు సరిగా చెప్పరని.. ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు. ఈ పరిస్థితిని మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని సర్కారు దావఖానాల రూపురేఖలు మారాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలోనే కార్పొరేట్‌కు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో విద్యా రంగంలోనూ మంచి మార్పు దిశగా రేవంత్ రెడ్డి సర్కారు అడుగులేస్తోంది

తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ పాఠశాల తరహాలోనే కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి ప్రతి మండలంలో కనీసం రెండు స్కూళ్లను పబ్లిక్ స్కూళ్లుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో మొదటి అడుగుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....