28-డేస్ ప్లాన్స్ రద్దు చేయాలి.. వినియోగించని డేటా ముందుకు తరలించాలి: రాఘవ్ చద్దా

Date:

AAP MP Raghav Chadha: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో టెలికాం కంపెనీల విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన 28 రోజుల రీఛార్జ్ ప్లాన్స్‌ను రద్దు చేసి, కనీసం 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లు అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రోజువారీగా మిగిలిపోయే డేటాను తదుపరి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.

Raghav Chadha on Mobile Recharge: ఇటీవల కాలంలో మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతూ రావడం తెలిసిందే. Reliance Jio, Bharti Airtel, Vodafone Idea వంటి టెలికాం సంస్థలు విభిన్న డేటా ప్లాన్లు, కొత్త వ్యాలిడిటీ ఆప్షన్లతో వినియోగదారులకు ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే, ఎక్కువగా మంత్లీ ప్లాన్లు 30 రోజుల బదులుగా 28 రోజుల గడువుతోనే అందించడం విమర్శలకు దారితీస్తోంది. ఈ అంశాన్ని గతంలో పలుమార్లు ప్రస్తావించినా మార్పు రాకపోవడంతో, రాఘవ్ చద్దా తాజాగా రాజ్యసభలో దీనిని మళ్లీ లేవనెత్తారు. 28 రోజుల ప్లాన్ల కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ విధానాన్ని నిలిపివేసి 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు తీసుకురావాలని సూచించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించినట్లు సమాచారం. కస్టమర్లకు మరింత ప్రయోజనం కలిగేలా 30 రోజుల వ్యాలిడిటీతో ఎక్కువ సంఖ్యలో ప్లాన్లు ప్రవేశపెట్టాలని టెలికాం కంపెనీలకు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి Jyotiraditya Scindia సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు పరిమితంగా 30 రోజుల ప్లాన్లు అందిస్తున్నప్పటికీ, వాటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. వన్‌టైమ్, కస్టమ్, రెగ్యులర్—మూడు కేటగిరీలలో కూడా 30 రోజుల గడువుతో ప్లాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉంటే, డేటా వినియోగంపై కూడా రాఘవ్ చద్దా కీలక ప్రశ్నలు లేవనెత్తారు. వినియోగదారులు చెల్లించిన డబ్బుకు సరితూగే ప్రయోజనం అందడం లేదని, వినియోగించని డేటా వృథా అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయన మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు ముందుంచారు.

రోజుకు 1GB లేదా 2GB డేటా ఇచ్చే ప్లాన్లలో వినియోగించని డేటా అదే రోజు అర్ధరాత్రికి ముగుస్తుందని, ఇది వినియోగదారులకు నష్టం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. ఈ రోజుల్లో మొబైల్ డేటా విలాసం కాదని, అది “డిజిటల్ ఆక్సిజన్” లాంటిదని వ్యాఖ్యానించారు. టెలికాం కంపెనీలు వినియోగదారులను దోపిడీ చేయడం ఆపాలని కూడా డిమాండ్ చేశారు.

రాఘవ్ చద్దా ప్రతిపాదనలు:

  • రోజువారీగా మిగిలిన డేటాను తదుపరి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేసే విధానం తీసుకురావాలి. పూర్తి వ్యాలిడిటీ ముగిసే వరకు ఆ డేటా చెల్లుబాటు కావాలి.
  • ప్రస్తుత రీఛార్జ్‌లో వినియోగించని డేటాను తదుపరి రీఛార్జ్‌లో అడ్జస్ట్ చేసుకునే విధంగా పాలసీ అమలు చేయాలి. వినియోగించిన డేటాకే మాత్రమే చార్జ్ విధించే విధానం ఉండాలి.
  • మనీ ట్రాన్స్‌ఫర్‌ల మాదిరిగా వినియోగించని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ డేటాను వినియోగదారుడి డిజిటల్ ఆస్తిగా గుర్తించాలి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...