టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

Date:

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి వేదికను నెల్లూరుకు మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ ఏపీ పర్యటన కారణంగా వేదికను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు వేదిక మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానం శ్రీకాకుళంలో మహానాడు నిర్వహించాలని ప్లాన్ చేసింది. మహానాడు కార్యక్రమాన్ని మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు సిక్కోలులో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలో ఈ వేడుకను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. అయితే తాజాగా మహానాడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ పర్యటన కారణంగానే మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

జూన్ నెలలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించాని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని ఉత్తరాంధ్రలో పలు కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధాని మోదీ వస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహణపై పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. అటు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, ఇటు డీపీ మహానాడు నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే మహానాడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చాలని భావిస్తున్నారట. ఒకవేళ శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మారిస్తే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి అంటున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...