మఖానా కీర్ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు పోషకాలు అందించే ఈ వంటకాన్ని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఉపవాసం ఉండేవారు శరీరానికి అవసరమైన శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి మఖానా కీర్ మంచి ఎంపికగా ఉంటుంది. అయితే చక్కెరను తగ్గించాలనుకునే వారు దీనిని షుగర్ లేకుండానే రుచికరంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మఖానా కీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఉపవాసం ఉండేవారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. మఖానాలో ఉండే పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి. అయితే చక్కెరను ఉపయోగించకుండా మఖానా కీర్ను తయారు చేసుకొని ఉపవాస సమయంలో తీసుకుంటే, తేలికగా జీర్ణమయ్యే పోషకాహారంగా ఉపయోగపడుతుంది. రుచితో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలోనూ ఇది సహాయపడుతుంది.
తయారీ ప్రక్రియలో ముందుగా మఖానాను సిద్ధం చేసుకోవాలి. స్టవ్పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అనంతరం ఒక ప్యాకెట్ మఖానాను పాన్లో వేసి, అవి కరకరలాడే వరకు బాగా వేయించాలి. మఖానా చక్కగా వేగితే కీర్ రుచి మరింత రుచికరంగా ఉంటుంది. మఖానా పూర్తిగా వేగిన తర్వాత వాటిని రెండు భాగాలుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా కొంత మఖానాను పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మఖానాను మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీర్ మరింత చిక్కగా, రుచిగా ఉంటుంది.
ఇప్పుడు స్టవ్పై మరో పాన్ పెట్టి అందులో అర లీటర్ పాలు పోయాలి. తర్వాత ఖర్జూరాలను గింజలు తొలగించి పాలలో వేసి బాగా కలపాలి. ఖర్జూరాలు సహజమైన తీపిని అందిస్తాయి కాబట్టి ప్రత్యేకంగా చక్కెర వేయాల్సిన అవసరం ఉండదు. పాలు బాగా మరిగే సమయంలో కొద్దిగా కుంకుమపువ్వు వేసి కలపాలి.
తర్వాత అందులో ఎండు ద్రాక్ష, వేసి మరో ఐదు నిమిషాల పాటు మరగబెట్టాలి. తర్వాత మఖానా పౌడర్ వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మఖానా గింజలను వేసి మంచిగా కలిపి ఉడకబెట్టుకోవాలి. క్రమంగా ఇది చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. పైన బాదం పలుకులు చల్లాలి. అంతే టేస్టీ టేస్టీ చక్కెర లేని మఖానా కీర్ రెడీ.

