ఎండలు 40 డిగ్రీలు ఉన్నా సరే పెరుగు పుల్లగా మారకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు

Date:

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జీర్ణ సమస్యలను నివారిస్తుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ బి6, బి12, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పెరుగు త్వరగా చెడిపోవడం అనేది ఒక ప్రధాన సమస్య. వేడి వాతావరణం కారణంగా పెరుగులో ప్రధానంగా ఉండే లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్ వంటి బాక్టీరియాల చర్య వేగంగా జరగడం వల్ల తొందరగా పుల్లగా మారుతుంది.

పెరుగు తోడుకోవడానికి లాక్టోబాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా అవసరం. అయితే వేసవి కాలంలో ఈ లాక్టోబాసిల్లస్‌ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. దీంతో పెరుగు త్వరగా పులిసిపోతుంది. అయితే పచ్చి మిరపకాయ తొడిమలో సహజ సిద్ధమైన బ్యాక్టీరియా, కొన్ని రకాల ఎంజైములు ఉంటాయి. ఇవి  సహాయపడటమే కాకుండా పులిసి పోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా వేగాన్ని నియంత్రిస్తాయి. అందుకే పాలకు తోడుపెట్టిన తర్వాత పైన బాగా కడిగిన తొడిమతో పాటు ఉన్న పచ్చిమిర్చి వేస్తారు. పెరుగు బాగా తోడుకున్న తర్వాత కావాలంటే ఆ పచ్చి మిరపకాయను బయటకు తీసేయొచ్చు. పెరుగుకు ఎలాంటి కారం అంటుకోదు.

పెరుగు త్వరగా పుల్లగా అవడానికి ప్రధాన కారణం అందులో ఉండే బ్యాక్టీరియా వేగంగా పెరిగి లాక్టిక్‌ యాసిడ్‌ను ఎక్కువగా విడుదల చేయడం వల్ల పెరుగు తొందరగా పుల్లగా మారుతుంది. ఇప్పుడు పాలు తోడు పెట్టాక పచ్చి కొబ్బరి ముక్క లేదా ఎండు కొబ్బరి ముక్క వేయడం వల్ల కొబ్బరికి స్వతహాగానే చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి పెరుగు పులిసేలా చేసే బ్యాక్టీరియా వేగాన్ని కంట్రోల్‌ చేస్తుంది. అలాగే కొబ్బరి ముక్క పెరుగులో ఉండే నీటిని కొంత పీల్చుకుంటుంది. దీని వల్ల పెరుగు గట్టిగా, కమ్మగా ఉంటుంది. ఇలా తోడుకున్న పెరుగులో ఫ్రిజ్‌లో పెడితే రెండు మూడు రోజులు ఫ్రెష్‌ టేస్ట్‌తోనే ఉంటుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...