రోజూ పప్పు తింటే క్యాన్సర్‌, గుండె జబ్బుల రిస్క్‌ తగ్గుతుందట, షుగర్‌ ఉన్న వాళ్లూ తినొచ్చన్న డాక్టర్‌

Date:

నేటి ఆధునిక కాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్‌, షుగర్‌ వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మరి ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు పప్పుధాన్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్‌, ప్రోటీన్లు, ఖనిజాలతో కూడిన పప్పు దినుసులు కొలెస్ట్రాల్‌ను తొలగించడమే కాకుండా శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. మాంసాహారానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలున్న పప్పుధాన్యాలను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గనుంది.

ఆరోగ్యమే మహాభాగం అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనం తీసుకునే ఆహారమే మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాంటి ఆహార పదార్థాల్లో పప్పుధాన్యాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రకృతి మనకు అందించిన ఎన్నో అద్భుతమైన పోషక భాండాగారాల్లో పప్పుధాన్యాలు కూడా ఒకటి. ఈ పప్పుధాన్యాలు మనం రోజు తినే ఒక సాధారణ ఆహార పదార్థాలుగానే కాకుండా , క్యాన్సర్‌ (Cancer) వంటి దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకునే శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తాయని డాక్టర్‌ సంజయ్‌ భట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ – ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజీ, ఆస్టర్‌ సీఎంఐ హాస్పిటల్‌ చెబుతున్నారు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్‌ సంజయ్‌ భట్‌ – సీనియర్‌ కన్సల్టెంట్‌ – ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజీ చెబుతున్న దాని ప్రకారం.. పప్పుధాన్యాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌ల ముప్పు తగ్గించుకోవచ్చు. పప్పుధాన్యాలు ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్‌ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా పప్పు ధాన్యాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...