రేషన్ లబ్ధిదారులకు శుభవార్త.. సన్న బియ్యంతో అవి కూడా పంపిణీ, భట్టి విక్రమార్క కీలక ఆదేశం

Date:

తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు తీపి కబురు. ప్రజలకు పౌష్టికాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు జొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను నేరుగా రేషన్ షాపులు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్రం మద్దతు లేకపోయినా, యాసంగి సీజన్‌లో పండించిన జొన్నలకు రాష్ట్ర నిధులతోనే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది.

మంగళవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను మార్కెట్ వేలంలో కాకుండా నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదని ప్రభుత్వం సేకరించిన పంట నేరుగా సామాన్యుడి చెంతకు చేరుతుందని అన్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనంలో జొన్నలను చేర్చాలని నిర్ణయించారు. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా పోషకాహార లోపంతో బాధపడకూడదని భట్టి సూచించారు.

మరోవైపు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో జొన్నలు, మొక్కజొన్నల ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోయినా రాష్ట్ర సొంత నిధులతోనే యాసంగి పంటను సేకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 278 కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న సేకరణ కొనసాగుతుండగా.. ఇప్పుడు జొన్నలను కూడా అదే రీతిలో సేకరించనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...