రాయలసీమకు చంద్రబాబు సరికొత్త నిర్వచనం..త్వరలో మరిన్ని శుభవార్తలు.!

Date:

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు సరికొత్త అర్థం చెప్పారు. రాయలసీమ అంటే కరవు కాదని.. హార్టీకల్చర్ హబ్‌గా అభివర్ణించారు. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు కేరాఫ్ అడ్రస్ రాయలసీమ అని అన్నారు. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, కియా కార్లు, ఖనిజాలు.. ఇలా రాయలసీమ స్వర్ణ యుగం దిశగా అడుగులు వేస్తోందన్నారు చంద్రబాబు. కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమ అంటే.. బీడువారినే భూములు, మోడువారిన బతుకులు.. ఎండిన చెట్లు, మండిన కడుపులు.. ఇది ఒకప్పుడు మాట. కాలం మారింది. నెర్రెలు చీలిన సేద్యపు భూములు.. నేడు ఉద్యానవన పంటలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. పండించేందుకు నీళ్లు లేక, ఉండడానికి ఉపాధి లేక.. పొట్టకూటి కోసం కన్నవారిని,. కట్టుకున్నవారిని వదిలి పరాయి ప్రాంతానికి వలసెళ్లిన సీమ బిడ్డలు.. నేడు ఉన్న ఊరిలో, అయినవారి మధ్యలో సగర్వంగా జీవించేందుకు అడుగులు పడుతున్నాయి. వెక్కిరించిన విధే తలవంచేలా.. సీమ రైతులు సాంకేతికతతో పంటలు పండిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తున్న రాయలసీమ.. స్వర్ణయుగం దిశగా ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో రాయలసీమకు కొత్త నిర్వచనం చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పరిశ్రమలతో రాయలసీమలో నవశకం మొదలైందన్నారు. ఈ క్రమంలోనే సీమకు చంద్రబాబు సరికొత్త అర్థం చెప్పారు. ఇప్పుడు రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్, రాయల్ ఎన్‌ఫీల్డ్, హార్టికల్చర్, కియా కార్లు, అరుదైన ఖనిజాలు, ఫైటర్ జెట్లు,హీరో బైకులు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ అంటూ చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమ అంటే కరవు నేల కాదని.. జలకళగా అభివర్ణించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....