గోదావరి జలాలతో రాయలసీమ కరవు నివారణకు శాశ్వత పరిష్కారం: మంత్రి

Date:

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (AP Minister Satyakumar Yadav) వ్యాఖ్యానించారు. పోలవరానికి కేంద్రం భారీ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.20,700 కోట్లను కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. మరో రూ.30 వేల కోట్లు ఇచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని చెప్పుకొచ్చారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకెళ్లటం వల్ల కరవు పరిస్థితులు నుంచి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. బీజేపీ పోలవరం సందర్శన యాత్రలో లోటుపాట్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి 80 శాతం పనులు పూర్తి అయ్యాయని వివరించారు. పదిరోజుల్లో ఎడమ ప్రధాన కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తామని మాధవ్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....