
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలు 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు తమ డిమాండ్లను మరింత విస్తరించారు. జూలై 20న శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు.
పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యమం నాలుగు ప్రధాన డిమాండ్లతో కొనసాగుతోందన్నారు. సోనమ్ వాంగ్చుక్ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం, జూలై 20 నిరసనకారులపై కేసులు నమోదు చేయకపోవడం తమ ప్రధాన డిమాండ్లని తెలిపారు.
ఉద్యమం ఉధృతం కావడంతో ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు పార్టీ వెల్లడించింది.

