
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం **’స్పిరిట్’**పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది.
తాజాగా ‘స్పిరిట్’ కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు సంస్థలు కలిసి కర్ణాటకలో చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నాయి.
ప్రభాస్కు కర్ణాటకలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి’ చిత్రాల విజయాన్ని కొనసాగిస్తూ ‘స్పిరిట్’తో కొత్త బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
టి-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న గ్రాండ్గా విడుదల కానుంది.

