రేయ్.. ఏంట్రా ఇలా ఉన్నారు.. బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..

Date:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఫేక్ ఫోన్‌పే స్క్రీన్‌షాట్ చూపించి రూ.97 వేల విలువైన బంగారు ఉంగరం, లాకెట్‌తో ఓ కేటుగాడు పరారయ్యాడు. నగలు కొనుగోలు చేసినట్లు నమ్మించి యూపీఐ చెల్లింపు జరిగినట్టుగా చూపించిన నిందితుడు, డబ్బులు ఖాతాలో జమ కాకముందే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫేక్ ఫోన్ ఫే స్క్రీన్ షాట్‌తో డబ్బులు చెల్లించినట్లుగా చూపించి బంగారు ఆభరణాలతో నిందితుడు జంప్ అయ్యాడు.. ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో చోటుచేసుకుంది. ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి ఓ కేటుగాడు బంగారు నగలు కాజేయడం సంచలనంగా మారింది. చేతన్ జ్యువెలరీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని చేతన్ జ్యువెలరీకి వచ్చిన ఓ వ్యక్తి ఉంగరం, లాకెట్ చూపించాలన్నారు.. అనంతరం పరిశీలించిన.. వాటిని ఎంపిక చేసుకున్నాడు.

అనంతరం మొత్తం రూ.1.05 లక్షలు అవుతాయని చెప్పగా బేరం ఆడి రూ.97 వేలకు ఒప్పించాడు. ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానంటూ బిల్లు రాయించుకున్న అతడు, ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి డబ్బులు పంపినట్లు నమ్మించాడు. నగలు దుకాణంలో ఇతర కస్టమర్స్ ఉండటంతో వారితో బిజీగా ఉన్న షాపు యాజమాని ..ఆ తర్వాత అకౌంట్ చెక్ చేయగా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ఖాతాలో నగదు జమ కాలేదని దుకాణ యజమానురాలు చెప్పేలోపే బంగారు నగలతో ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. యజమానురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు కొత్తగూడెం వైపు తప్పించుకున్నట్లు స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు నిందితుడు మండలంలోని పలువురు బంగారు దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు కూడా సీసీ కెమెరాల్లో నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....