Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..!

Date:

విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విశాఖపట్నంలోని పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్‌లో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పెద జాలారిపేటకు చెందిన నీతూ, రాము తమ స్నేహితులతో కలిసి ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా బీచ్‌కు వెళ్లారు. మొత్తం ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు సముద్ర తీరంలో సందడి చేశారు. ఈ క్రమంలో ఫోటోలు తీసుకునేందుకు సముద్రంలోని రాతిపై నిలబడ్డారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీ కెరటం ఎగసిపడటంతో నీతూ, రాము సముద్రంలో పడిపోయారు. అక్కడున్న స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన ఇద్దరి కోసం పోలీసులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలిస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫోటోల కోసం సముద్రంలోని రాళ్లపైకి వెళ్లొద్దని, అలల తీవ్రతను తక్కువగా అంచనా వేయవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన యువతి, యువకుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...