సీఎంఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫోకస్ డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలకు సన్నాహాలు

Date:

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించించారు. సీఎంఆర్‌లో గత 10-12 ఏళ్లుగా జరిగిన వ్యవహారాలపై లోతుగా పరిశీలన చేపట్టారు. సీఎంఆర్ వ్యవస్థలో పారదర్శకత, సాంకేతిక సంస్కరణలపై చర్చించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వానికి సీఎంఆర్ బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. బకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇప్పటివరకు నిర్వహించిన విజిలెన్స్ దాడులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతిపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. జిల్లాల వారీగా రైస్ మిల్లర్ల పనితీరు, సీఎంఆర్ బకాయిల పరిస్థితి, డిఫాల్ట్‌ల వివరాలపై అధికారులు నివేదికలు సమర్పించారు.

ప్రభుత్వ ఆస్తుల రక్షణకు అనుసరించాల్సిన కొత్త వ్యూహాలను రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్, లీగల్ విభాగాల ఉన్నతాధికారులకు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రభుత్వ నిధుల రక్షణే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...