ఈ నెలలోనే అమరావతికి రెండు శుభవార్తలు.. చంద్రబాబు కీలక ప్రకటన

Date:

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించి శుభవార్త వినిపించారు. అమరావతిలో ఈ నెలలోనే రెండు కీలక ప్రారంభాలు జరగనున్నట్లు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు అమరావతిలో ఇప్పటికే సీఆర్డీఏ భవనం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రానున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తలు వినిపించారు. ఆగస్ట్ నెలలో అమరావతిలో రెండు కీలక ప్రారంభాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతోపాటుగా.. అమరావతి లో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అమరావతి పనులు వర్షాకాలంలోనూ వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో చంద్రబాబు విలేకర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే అమరావతిలో ఆగస్టు నెలలో రెండు ప్రారంభాలు చేయనున్న విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ..మరోవైపు రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సె్స్ రోడ్డును ఈ నెల 13న ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట మీదుగా వేగంగా అమరావతికి చేరుకోవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు 21 కిలోమీటర్ల మేరకు నిర్మించారు. ఫేజ్ 1 కింద 14.35 కిలోమీటర్లు, ఫేజ్ 2 కింద 3.92 కిలోమీటర్లు, ఫేజ్ 3 కింద 3.51 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్
మరోవైపు అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం క్వార్టర్స్ నిర్మించారు. 12 అపార్టుమెంట్ టవర్ల నిర్మాణం పూర్తి అయ్యింది. వీటిని త్వరలోనే సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌లను కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మొత్తంగా అమరావతిలో ఇప్పటికే సీఆర్డీఏ భవనం అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రానుంది. దీంతో అమరావతి నిర్మాణ పనులలో కీలక ప్రారంభోత్సవాలకు ఆగస్ట్ నెల వేదిక కానుంది. మరోవైపు 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా నిర్మాణ పనులలో వేగం పెంచారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...