పెరిగిన పోర్టు కాలుష్యం

Date:

విశాఖపట్నం పోర్టులో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కాలుష్య నియంత్రణకు అధికారులు నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పలు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటి అమలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా సరకు నిల్వ, రవాణా కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారులు కాలుష్య నియంత్రణ చర్యలకు సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో పాత పద్ధతుల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విశాఖపట్నం పోర్టులో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) కింద పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుమ్ము ధూళి నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే సరకు రవాణా వాహనాలపై భారీగా జరిమానాలు విధించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో గత జూలై 17న పర్యావరణ పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కాలుష్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పోర్టులో సరకు రవాణా చేసే బీఓటీ పీపీపీ ఓ అండ్‌ ఎం ఆపరేటర్లు కమిటీ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. పోర్టు యూజర్లు కూడా కాలుష్య నివారణ చర్యలకు సహకరించాలని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...