శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

Date:

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్‌.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జగన్‌ సూచించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఇటీవల వరకు జకియా ఖానం ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా కొనసాగారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న ఆమె పదవీకాలం పూర్తవడంతో డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ స్థానం ఖాళీ అయింది. త్వరలో శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ పదవికి ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.

మండలిలో వైసీపీకి ఉన్న సంఖ్యాబలంతో మాధవరావు ఎన్నికపై ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికార కూటమి వ్యూహం ఎలా ఉండబోతోందన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...