చమురు సంక్షోభం వేళ ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కీలక విజ్ఞప్తి ఏమన్నారంటే..?

Date:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులకు ఇరాన్‌ భయపడిందన్నారు. హార్ముజ్ జలసంధిని రక్షించడానికి ఇతర దేశాలు యుద్ధనౌకలను పంపాలని డొనాల్డ్ ట్రంప్ కోరారు. అమెరికా నావికాదళం త్వరలో హార్ముజ్ జలసంధి ద్వారా ట్యాంకర్లకు ఎస్కార్ట్ చేయడం ప్రారంభిస్తుందని ఆయనచెప్పారు. ఇరాన్‌తో యుద్దం 16వ రోజుకు చేరుకున్న వేళ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా నాశనమైందని ట్రంప్ పేర్కొన్నారు. టెహ్రాన్ ఎంత ఘోరంగా ఓడిపోయిందన్నారు. అయినా ఒకటి లేదా రెండు డ్రోన్‌లను పంపడం, ఒక మందుపాతరను వేయడం ద్వారా భయపెట్టాలని చూస్తుంది. హార్ముజ్ జలమార్గంలో ఎక్కడైనా క్షిపణిని ప్రయోగించడం చాలా సులభం అని ఆయన అంగీకరించారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ సహా ప్రభావితమైన ఇతర దేశాలు ఈ ప్రాంతానికి నౌకలను పంపాలని కోరారు. తద్వారా హార్ముజ్ జలసంధి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన దేశానికి ఇకపై ముప్పుగా మారదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి శనివారం (మార్చి 14) తీవ్రంగా స్పందించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు విదేశీ సైనిక దళాలను బహిష్కరించాలని కోరారు. ట్రంప్ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ, అరాఘ్చి సోషల్ మీడియా వేదికగా రాశారు, “అమెరికా ప్రోత్సహించిన భద్రతా దళాలను ఖాళీ చేయించాలి. లేదంటే ఈ సంక్షోభాన్ని తగ్గించడానికి బదులుగా పెరుగుతోంది. అమెరికా ఇప్పుడు హార్ముజ్‌ను రక్షించాలని చైనాతో సహా ఇతరులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇరాన్ తన పొరుగు దేశాలకు విదేశీ ఆక్రమణదారులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

ఇదిలావుంటే, ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. టెహ్రాన్ హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణాను అడ్డుకోవడం కొనసాగిస్తే ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. యుద్ధం ఉద్రిక్తతల వేళ మార్చి 1న ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు సమాచారం. ఈ జలమార్గం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో ఒకటి. సాధారణంగా రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేస్తుంది. ప్రపంచ సహజ వాయువు వ్యాపారంలో దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...