గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా భయబ్రాంతులకు గురైన వాహనదారులు

Date:

రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జైపూర్–అజ్మేర్ నేషనల్ హైవే-48పై గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

బర్నా గ్రామం నుండి కిషన్‌గఢ్ వైపు సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కు.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా, టైర్ పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన లారీ రోడ్డుపై పల్టీ కొట్టినట్లు సమాచారం. వాహనం పడిపోవడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు హైవేపై నలువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. అవి ఎక్కడ పేలుతాయోనని స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులుఅ వెంటనే అతన్ని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కానీ అతను చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న వెంటనే మదన్‌గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం తరువాత, హైవే అంతటా చెల్లాచెదురుగా ఉన్న సిలిండర్లను చూసి స్థానికులు భయపడ్డారు. కానీ వెంటనే పోలీసులకు తమ సహాయాన్ని అందించారు. చాలా మంది రోడ్డు పక్కన ఉన్న సురక్షితమైన ప్రదేశంలోకి సిలిండర్లను చేర్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంలో సహాయపడ్డారు.

సిలిండర్లు ఏవీ లీక్ కాలేదని, పెద్ద విషాదాన్ని నివారించాయని పోలీసులు చెబుతున్నారు. స్థానికుల సహాయంతో రోడ్డుపై పడ్డ సిలిండర్లను మరో వాహనంలో లోడ్ చేసి అక్కడి నుంచి తరలించారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...