గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా భయబ్రాంతులకు గురైన వాహనదారులు

Date:

రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జైపూర్–అజ్మేర్ నేషనల్ హైవే-48పై గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

బర్నా గ్రామం నుండి కిషన్‌గఢ్ వైపు సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కు.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా, టైర్ పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన లారీ రోడ్డుపై పల్టీ కొట్టినట్లు సమాచారం. వాహనం పడిపోవడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు హైవేపై నలువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. అవి ఎక్కడ పేలుతాయోనని స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులుఅ వెంటనే అతన్ని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కానీ అతను చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న వెంటనే మదన్‌గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం తరువాత, హైవే అంతటా చెల్లాచెదురుగా ఉన్న సిలిండర్లను చూసి స్థానికులు భయపడ్డారు. కానీ వెంటనే పోలీసులకు తమ సహాయాన్ని అందించారు. చాలా మంది రోడ్డు పక్కన ఉన్న సురక్షితమైన ప్రదేశంలోకి సిలిండర్లను చేర్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంలో సహాయపడ్డారు.

సిలిండర్లు ఏవీ లీక్ కాలేదని, పెద్ద విషాదాన్ని నివారించాయని పోలీసులు చెబుతున్నారు. స్థానికుల సహాయంతో రోడ్డుపై పడ్డ సిలిండర్లను మరో వాహనంలో లోడ్ చేసి అక్కడి నుంచి తరలించారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...