చమురు సంక్షోభం వేళ ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కీలక విజ్ఞప్తి ఏమన్నారంటే..?

Date:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులకు ఇరాన్‌ భయపడిందన్నారు. హార్ముజ్ జలసంధిని రక్షించడానికి ఇతర దేశాలు యుద్ధనౌకలను పంపాలని డొనాల్డ్ ట్రంప్ కోరారు. అమెరికా నావికాదళం త్వరలో హార్ముజ్ జలసంధి ద్వారా ట్యాంకర్లకు ఎస్కార్ట్ చేయడం ప్రారంభిస్తుందని ఆయనచెప్పారు. ఇరాన్‌తో యుద్దం 16వ రోజుకు చేరుకున్న వేళ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా నాశనమైందని ట్రంప్ పేర్కొన్నారు. టెహ్రాన్ ఎంత ఘోరంగా ఓడిపోయిందన్నారు. అయినా ఒకటి లేదా రెండు డ్రోన్‌లను పంపడం, ఒక మందుపాతరను వేయడం ద్వారా భయపెట్టాలని చూస్తుంది. హార్ముజ్ జలమార్గంలో ఎక్కడైనా క్షిపణిని ప్రయోగించడం చాలా సులభం అని ఆయన అంగీకరించారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ సహా ప్రభావితమైన ఇతర దేశాలు ఈ ప్రాంతానికి నౌకలను పంపాలని కోరారు. తద్వారా హార్ముజ్ జలసంధి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన దేశానికి ఇకపై ముప్పుగా మారదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి శనివారం (మార్చి 14) తీవ్రంగా స్పందించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు విదేశీ సైనిక దళాలను బహిష్కరించాలని కోరారు. ట్రంప్ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ, అరాఘ్చి సోషల్ మీడియా వేదికగా రాశారు, “అమెరికా ప్రోత్సహించిన భద్రతా దళాలను ఖాళీ చేయించాలి. లేదంటే ఈ సంక్షోభాన్ని తగ్గించడానికి బదులుగా పెరుగుతోంది. అమెరికా ఇప్పుడు హార్ముజ్‌ను రక్షించాలని చైనాతో సహా ఇతరులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇరాన్ తన పొరుగు దేశాలకు విదేశీ ఆక్రమణదారులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

ఇదిలావుంటే, ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. టెహ్రాన్ హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణాను అడ్డుకోవడం కొనసాగిస్తే ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. యుద్ధం ఉద్రిక్తతల వేళ మార్చి 1న ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు సమాచారం. ఈ జలమార్గం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో ఒకటి. సాధారణంగా రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేస్తుంది. ప్రపంచ సహజ వాయువు వ్యాపారంలో దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...