హైదరాబాద్ పాతబస్తీకి మరో మణిహారం.. సిద్ధమైన స్టీల్ బ్రిడ్జి, రోజూ లక్షన్నర వాహనాలకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

Date:

హైదరాబాద్ పాతబస్తీలో చంచల్‌గూడ జైలు నుంచి సైదాబాద్ మీదుగా ఒవైసీ హాస్పిటల్ వరకు నిర్మించిన 2.58 కిలోమీటర్ల నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి ఆగస్టు రెండో వారంలో ప్రారంభం కానుంది. రూ.620 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ద్వారా రోజుకు సుమారు 1.5 లక్షల వాహనాలు ప్రయోజనం పొందనున్నాయి. సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం 30 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గడంతో పాటు ఇంధన వినియోగం, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గనున్నాయి.

హైదరాబాద్ పాతబస్తీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, నగర ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు నిర్మించిన చంచల్‌గూడ జైలు–ఒవైసీ ఆసుపత్రి స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే జూపార్క్–ఆరాంఘర్, మిథాని, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో నిర్మించిన పైవంతెనలు ప్రజలకు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు మరో కీలకమైన స్టీల్ ఫ్లైఓవర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆగస్టు రెండో వారంలో ఈ ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఫ్లైఓవర్‌పై రంగులు వేయడం, వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు, చివరి దశ ర్యాంపుల నిర్మాణం వంటి పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అన్ని పనులు పూర్తయిన వెంటనే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రోజుకు సుమారు 1.5 లక్షల వాహనాలు ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణాలు చేయవచ్చు. ముఖ్యంగా బడంగ్‌పేట్, ఆదిభట్ల, సంతోష్‌నగర్ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్, కోటి, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర నగర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ప్రస్తుతం ట్రాఫిక్ కారణంగా ఎక్కువ సమయం పడుతున్న ఈ మార్గంలో ప్రయాణ సమయం కనీసం 20 నిమిషాల వరకు తగ్గనుంది. దీంతో ఇంధన వినియోగం తగ్గడంతో పాటు వాహన కాలుష్యం, ట్రాఫిక్ ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ప్రస్తుతం నల్గొండ క్రాస్ రోడ్డు ఫ్లైఓవర్ నుంచి చంపాపేట్ మీదుగా ఒవైసీ ఆసుపత్రి సమీపంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుకు చేరుకోవాలంటే సుమారు 3 కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఐదు ట్రాఫిక్ సిగ్నళ్లను దాటాల్సి వస్తోంది. ఈ కారణంగా రద్దీ సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. వాస్తవానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాంతంలో రహదారిని 100 అడుగుల వెడల్పుకు విస్తరించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...