Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!

Date:

హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన స్వామి తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న సహచర సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి ఆయన మృతిచెందినట్లు గుర్తించారు.

ఘటన స్థలంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుబట్టవద్దని, వారు ఎంతో మంచివారని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, వారిని ఎప్పటికీ కాపాడుతానంటూ భావోద్వేగంగా రాసినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...