
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీసీ సంస్థ భాగస్వామి కానుందని స్వర్ణాంధ్ర పీ 4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధికి ఐటీసీ సహకరించనుందని ఆయన వెల్లడించారు. మూడేళ్ల కాల పరిమితితో ఈ ప్రాజెక్టు అమలుకానుంది. కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడంతోపాటు వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించున్నారు. గ్రామీణ ప్రజల జీవనోపాధి, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధికి ఐటీసీ సహకరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు, సమగ్ర గ్రామీణాభివృద్ధిలో ఐటీసీ సంస్థ భాగస్వామ్యం కానుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో జరగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఐటీసీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ కుటుంబాల జీవనోపాధి పెంచడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు అక్కడి ప్రజలకు మెరుగైన జీవన అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమం మూడేళ్ల కాలపరిమితితో ఐటీసీ భాగస్వామ్యంతో అమలు కానుంది. ఐటీసీతో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడంతో పాటు వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఇందులో భాగంగా కార్యక్రమం అమలు, పర్యవేక్షణకు ప్వర్ణాంధ్ర ఫౌండేషన్, ఐటీసీ ప్రతినిధులతో ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

