
తమ దగ్గర బ్లాక్ మనీ ఉందని.. వైట్లో డబ్బులు ఇస్తే ఒక నోటుకు ఐదు నోట్లు ఇస్తామని చెప్పడంతో ఒక వ్యక్తి ఆశపడ్డాడు. సరే, ముందు చూసొద్దామని కేటుగాళ్ల దగ్గరకు వెళ్లడంతో వాళ్లు పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ చూయించి, ఇదే బ్లాక్ మనీ అని నమ్మించారు. విషయం తెలుసుకున్న అతను అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేయగా.. కత్తులతో బెదిరించి అతని దగ్గర ఉన్న డబ్బంతా దోచుకున్నారు ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
ఒకనోటుకు ఐదు నోట్ల బ్లాక్ మనీ ఇస్తానని చెప్పడంతో అతను ఆశపడ్డాడు. డీల్ ఇంట్లోనే పెట్టుకుందాం అనేసరికి పని ఈజీగా అయిపోతుంది అనుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత బ్లాక్ మనీకి బదులు పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లను బ్లాక్ మనీగా చూయించారు. అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా కత్తులతో బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన తిరుపతి పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన అజ్మీరా రాజారామ్కు బ్లాక్ మనీ ఇస్తామని పిచ్చాటూరుకు చెందిన ప్రకాశ్ నమ్మబలికాడు. అసలు కరెన్సీ ఇస్తే తనకు బ్లాక్ మనీ రూపంలో ఐదు రెట్లు ఇస్తానని చెప్పడంతో రాజారామ్ ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీని చూయించి ఇదే బ్లాక్ మనీ అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశాడు. అది పసిగట్టిన రాజారామ్ అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు.

