
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో శుక్రవారం దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి.
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330గా ఉండగా, ఒక్కరోజే రూ.1,850 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,32,300 వద్ద ట్రేడవుతూ రూ.1,700 పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,480, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,450గా నమోదైంది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, ఢిల్లీలో కిలో వెండి రూ.5,000 తగ్గి రూ.2.40 లక్షలు (హైదరాబాద్), రూ.2.35 లక్షలు (ఢిల్లీ) వద్ద ట్రేడవుతోంది.
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రస్తుత ధరలు అనుకూలంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

