“మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మార్చి చూపిస్తా”: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నారా లోకేశ్

Date:

2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అవహేళన చేశారని.. ఆ కసితోనే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక సంకల్పం పెట్టుకున్నానని నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పమని చెప్పారు. మన ఇల్లు – మన లోకేశ్ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని నిరుపేదల కోసం ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నా.. దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూయిస్తా అని మంత్రి లోకేశ్ అన్నారు. మన ఇల్లు – మన లోకేశ్ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో తన ఓటమికి చంద్రబాబును కూడా అవహేళన చేశారని, ఆ కసితోనే మంగళగిరి అభివృద్ధికి పూనుకున్నట్లు ఆయన తెలిపారు

మన ఇల్లు – మన లోకేశ్ పేరుతో మంగళగిరిలో మంగళవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా మూడు వేల మందికి ఇంటి పట్టాలు అందజేశారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తాను నిలబెట్టుకున్నానని, అందులో భాగంగానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆయన మాట ఇచ్చారు.

మంగళగిరిలోని రూ. వెయ్యి కోట్ల ఆస్తిని నిరుపేదల కోసం ఇళ్ల పట్టాల రూపంలో అందజేసినట్లు లోకేశ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూ. 1 ఉంటే.. ఖర్చు రూ. 1.60 పైసలుగా ఉందని.. రెండేళ్ల అభివృద్ధిలోనే ఆ ఖర్చును రూ. 1.40 పైసలు చేర్చామని ఆయన తెలిపారు. తాము ఇస్తున్న శాశ్వత భూ పట్టాలతో పేదల ఆస్తిని ఎవ్వరూ కదిలించలేరని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....