Weather Report: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

Date:

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాబట్టి రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉంబోతున్నాయో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌ల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణకోస్తా ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు: ఈ జిల్లాలో మంగళ, బుధ వారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక గురువారం వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని స్పష్టం చేసింది.

రాయల సీమలో వర్షాలు: ఇక రాయలసీమలోనూ రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళ, బుధవారంలో వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో, గురువారం గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే వర్షాల పట్ల ప్రమత్తంగా ఉండాలని రైతులక కొన్ని సూచనలు చేసింది వాతావరణ శాఖ. వర్షాలు కురిసే సమయంలో ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గర్లో ఉండకూడదని సూచింది. అలాగే రైతులు పోలాలకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగిపడితే..విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....