ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం వరుసగా పశువులపై దాడి

Date:

జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం గవరంపేటలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గ్రామ పరిసరాల్లో మూడు పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు కామవరం సమీపంలో రెండు పశువులను పెద్దపులి చంపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.

కొండ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న పెద్దపులి. పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి కదలికలను రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...