ఎల్‌ఐసీ లాభం రూ.13,492 కోట్లు

Date:

న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) 23 శాతం వృద్ధితో రూ.13,492 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.10,987 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

సమీక్షా త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.2,22,864 కోట్ల నుంచి రూ.2,37,848 కోట్లకు పెరిగింది. కొత్త వ్యాపారంలో పెరుగుదల సంస్థ లాభాల్లో వృద్ధికి దోహదపడింది. మొత్తం ప్రీమియం ఆదాయం జూన్‌ త్రైమాసికంలో రూ.1,27,250 కోట్లుగా ఉందని, క్రితం ఆర్థిక సంవత్సరం.

ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,19,200 కోట్లతో పోల్చితే 6.75 శాతం వృద్ధి నమోదైందని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. కాగా జూన్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ తొలి సంవత్సర ప్రీమియం ఆదాయం రూ.9,217 కోట్లకు పెరిగింది. రెన్యూవల్‌ ప్రీమియం ఆదాయం రూ.61,833 కోట్లకు చేరుకుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...