సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్

Date:

కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

ప్రస్తుతం వేసవి కాలం రావడంతో మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. పండ్లలో రారాజు అయిన మామిడి పండు పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మార్కెట్లో బంగారు వర్ణంతో.. చూస్తేనే తినాలనే విధంగా.. నిగనిగలాడే మామిడి పండ్లు.. బండ్లు, దుకాణాల్లో సందడి చేస్తున్నాయి. రకరకాల మామిడి పండ్లు అన్నీ మార్కెట్‌కు రావడంతో మ్యాంగో లవర్స్‌ ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే ఇప్పుడు మామిడి పండ్ల ప్రియుల గుండె గుభేల్ మనే వార్త వచ్చింది. కొందరు కాసుల కక్కుర్తి ఉన్న వ్యాపారులు.. మామిడి పండ్లను రసాయనాలతో మగ్గించి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా.. ప్రజలను అప్రమత్తం చేశారు. కల్తీ మామిడి పండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పాలని వెల్లడించారు.

వేసవి రాకతో పండ్లలో రారాజైన మామిడి పండ్లు మార్కెట్‌లో సందడి చేస్తోందని.. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజ‌లు విస్మరించకూడదని సజ్జనార్ అలర్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని.. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ.. పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...