హైదరాబాద్‌ కంటే అమరావతిలో భూముల ధర ఎక్కువ.. అప్పుడు నా మాట నమ్మినవారు ఇప్పుడు కోటీశ్వరులు: చంద్రబాబు

Date:

వైసీపీ నాశనం చేయాలనుకున్న అమరావతిని తాము శాసనం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని.. వారిలాగే అమరావతి రైతులు కూడా లాభపడతారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు వేల ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇవ్వటం ఒక కేస్ స్టడీగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గతంలో హైదరాబాద్‌లో కంటే అమరావతిలో భూముల విలువ ఎక్కువ ఉండేదని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ భూముల విలువ పెరిగిందని.. కానీ అమరావతిలో భూములు వ్యవసాయ భూములు కావటంతో ఎక్కువ విలువ ఉండేదన్నారు. కృష్ణా డెల్టా కింద నీటిని ఉపయోగించుకుంటూ ఉండటంతో భూములు ఇచ్చే పరిస్థితులలో కూడా లేరన్నారు చంద్రబాబు.

” రాజధాని కోసం పిలుపిస్తే.. 58 రోజులలో, 29 వేల మంది రైతులు.. 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్.. అభివృద్ధిలో రైతుల భాగస్వా్మ్యం.. ప్రపంచంలో ఇదో కేస్ స్టడీ. తమ జీవితాలు బాగుపడతాయని.. హైదరాబాద్ అభివృద్ధి చూసిన నమ్మకంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 5 వేల ఎకరాలు భూసేకరణ చేశాం. అప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. ఇక్కడ భూములు ఇవ్వండి.. పక్కన కొనుక్కోండి. ఇక్కడ ఎయిర్‌పోర్టు వస్తుంది.. దీంతో మీ భూముల విలువ పెరుగుతుందని చెప్పాం.. చాలా మంది నమ్మారు, ఇప్పుడు బాగుపడ్డారు. ” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...