Save Punarvika: చిన్నారి పునర్వికకు అండగా నారా లోకేష్ రూ.6 కోట్ల బాధ్యత తనదంటూ

Date:

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. పునర్విక చికిత్స కోసం అవసరమైన ఆరు కోట్ల రూపాయలు సమకూర్చడం తన బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. చిన్నారి పునర్విక చికిత్స కోసం రూ.16 కోట్లు కావాల్సి ఉండగా దాతల నుంచి రూ.10 కోట్లు సమకూరాయని మిగతా మొత్తాన్ని అందించాలని పునర్విక తల్లిదండ్రులు నారా లోకేష్‌ను సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో వీడియోపై స్పందించిన నారా లోకేష్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

పునర్విక చికిత్స కోసం అన్నిరకాలుగా ప్రయత్నించామని.. సోషల్ మీడియా, ఇతర దాతల సహకారంతో రూ. 10 కోట్లు సమకూరాయని పునర్విక తల్లిదండ్రులు వీడియోలో పేర్కొన్నారు. మిగతా రూ.6 కోట్లను సమకూర్చి, చిన్నారిని ఆదుకోవాలని నారా లోకేష్‌ను కోరారు. దీనికి స్పందించిన నారా లోకేష్ మిగతా రూ.6 కోట్లు తన బాధ్యత అంటూ వారికి భరోసా ఇచ్చారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా బదులిచ్చారు. SMA టైప్-1 అనేది అరుదైన, ప్రమాదకరమైన జన్యుపరమైన పరిస్థితి అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇది పిల్లల కండరాలను బలహీనపరుస్తుందని నెమ్మదిగా కదలడానికి, శ్వాస తీసుకోవడానికి, సాధారణంగా జీవించడానికి వీలు లేకుండా చేస్తుందని అన్నారు. ఈ స్థితిలోనూ కర్నూలుకు చెందిన పునర్విక ధైర్యంగా పోరాడుతోందని నారా లోకేష్ అన్నారు.

మరోవైపు సురేష్‌కుమార్ తొలుత విడుదల చేశారు. ఇకపై ఎవరూ కూడా డబ్బులు డొనేట్ చేయవద్దని కోరారు. అయితే అప్పటికి రూ.10 కోట్లు మాత్రమే సమకూరాయని మిగతా మొత్తం కోసం నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీనిపై ఆయన స్పందించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....