NEET UG 2026 కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. MCC కీలక ఉత్తర్వులు జారీ

Date:

NEET UG 2026 కౌన్సెలింగ్‌లో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) పలు కీలక మార్పులు చేసింది. ఈ మార్పులతో కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, విద్యార్థులకు సులభంగా మారనుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం సీటు అప్‌గ్రేడ్ కోరిన విద్యార్థులు ఇకపై కేటాయించిన కాలేజీకి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే..?

హైదరాబాద్, జులై 30: NEET UG 2026 కౌన్సెలింగ్‌కు ముందు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కీలక మార్పులను ప్రకటించింది. వైద్య ప్రవేశాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో ఈ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌లో ఏదైనా రౌండ్‌లో సీటు పొందిన అభ్యర్థులు తదుపరి రౌండ్‌లో అప్‌గ్రేడ్ (Upgrade) ఎంపిక చేసుకుంటే, ఇప్పటికే కేటాయించిన కళాశాలకు ప్రత్యక్షంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. వారి అడ్మిషన్ యథాతథంగా కొనసాగుతుంది. వీరు తదుపరి రౌండ్‌లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం తగ్గడంతో పాటు సమయం, ఆర్థిక భారం కూడా విద్యార్థులు, తల్లిదండ్రులపై తగ్గనుంది.

ఆన్‌లైన్ ద్వారానే సీటు వదులుకునే సౌకర్యం

మరో కీలక నిర్ణయం ఏమంటే కేటాయించిన సీటును వదులుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఆన్‌లైన్ రాజీనామా (Online Resignation) సౌకర్యాన్ని MCC అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై సంబంధిత మెడికల్ కళాశాలకు వెళ్లకుండా కౌన్సెలింగ్ నిబంధనలు, గడువులోపు ఆన్‌లైన్ ద్వారానే సీటును రద్దు చేసుకునే అవకాశం కల్పించింది.

NRI కోటా అభ్యర్థులకు కొత్త వెసులుబాటు

NRI కోటా కింద డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోరే విద్యార్థులు ఇకపై అవసరమైన పత్రాలను కౌన్సెలింగ్ పోర్టల్‌లోనే ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. దీంతో డాక్యుమెంట్ సమర్పణ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఈ మార్పుల అమలుకు సంబంధించి 2026 మే, జూన్ నెలల్లో MCC పలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య అధికారులు, మెడికల్ కళాశాలల ప్రతినిధులు ఈ శిక్షణల్లో పాల్గొని కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కమిటీ సూచించింది. కౌన్సెలింగ్ సమయంలో సీట్ల లభ్యత, కళాశాల ఫీజులు, అడ్మిషన్‌కు సంబంధించిన ఇతర కీలక వివరాలు విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య అధికారులను MCC ఆదేశించింది. ఇటీవల NEET UG 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను MCC త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైద్య విద్య అభ్యర్థులు అధికారిక ప్రకటనలపై దృష్టి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...