నేతన్న సేవలో పథకం: వారికి కూడా రూ.25 వేలు సాయం.. మంత్రి సవిత ప్రకటన

Date:

నేతన్న సేవలో పథకం లబ్ధి అందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ పథకం ప్రయోజనాలు అందని అర్హులక, వారం రోజుల్లోగా ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. దరఖాస్తుదారులలోని అర్హులను గుర్తించి.. రూ.25 వేలు అందిస్తామని స్పష్టం చేశారు. నేతన్న సేవలో పథకం అమలుపై సచివాలయంలో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే మిగతా అర్హులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని.. చేనేతల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నేతన్నలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇటీవలే నేతన్న సేవలో పథకం కూడా ప్రారంభించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగాఆగస్ట్ ఏడో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి.. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 25 వేల రూపాయలు చొప్పున జమ చేశారు. అయితే ఇంకా కొంతమంది అర్హులకు నేతన్న సేవలో పథకం లబ్ధి అందలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి సవిత స్పందించారు. సచివాలయంలో సోమవారం రోజు నేతన్న సేవలో పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సవిత.. ఇంకా మిగిలిపోయిన అర్హులకు కూడా నేతన్న సేవలో సాయాన్ని అందించాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి రూ.25 వేలు అందించాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 71,536 మంది లబ్ధిదారులకు నేతన్న సేవలో పథకం కింద రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి సవిత వివరించారు. అర్హులైన మిగతా వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కోసం 13,678 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లో రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. చేనేతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సవిత.. 50 ఏళ్లు నిండిన చేనేతలకు పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 85,678 మంది చేనేతలు పింఛన్లు అందుకుంటున్నారని.. 62,541చేనేత కుటుంబాలు ఉచిత విద్యు్త్ ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు.

మరోవైపు నేతన్న సేవలో పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు వస్తున్నాయి. చేనేత వృత్తిలో ఏళ్లుగా కొనసాగుతున్న వారిని కూడా.. ఉచిత విద్యుత్ పథకం వర్తించలేదనే సాకుతో దూరం పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి, షెడ్డుల్లో మాస్టర్‌ వీవర్స్‌ కింద పనిచేసే వారికీ కూడా ఈ పథకం ప్రయోజనాలు అందలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరికీ వారం లోగా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి సవిత చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...