PM Modi: పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. అలా చేస్తే ఎవ్వరినీ వదలం!

Date:

దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులపై వేగవంతమైన విచారణ జరిపి, దోషులకు త్వరితగతిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ.. దేశ యువత భవిష్యత్తు, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేపర్ లీకేజీలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మోదీ హెచ్చరించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా ఇలాంటి కేసుల్లో త్వరిత విచారణ పూర్తి చేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...