
అమరావతి: D news:అగ్నిప్రమాదాలను వేగంగా నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం అగ్నిమాపక శాఖను ఆధునిక వాహనాలతో బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.40 కోట్లతో 58 అధునాతన ఫైర్ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు.
వీటిలో 25 అధునాతన ఫైర్ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలు ఉన్నాయి.
ఎక్కడ ఉపయోగిస్తారంటే..
గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 25 అధునాతన వాహనాలను వినియోగించనున్నారు. భారీ అగ్నిప్రమాదాల్లో నిరంతర నీటి సరఫరా కోసం 20 వాటర్ బౌజర్లు ఉపయోగపడనున్నాయి.
ఇరుకైన వీధులు, రద్దీ ప్రాంతాలకు వేగంగా చేరుకునేందుకు 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి మంటలను త్వరగా అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పటికే తొలి దశలో రూ.33 కోట్లతో 65 ఫైర్ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా వాహనాలతో రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

