శరవేగంగా రిటైనింగ్ వాల్ పనులు.. కృష్ణా వరదల నుంచి ప్రజలను కాపాడేందుకే!

Date:

తాడేపల్లి పరిధిలోని సీతానగరం నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 0.900 కిలో మీటర్ల నుంచి 2.010 కిలోమీటర్ల వరకు రూ. 294.20 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణానది వరద ముంపు ముప్పు నుంచి కాపాడేందుకు ఈ ఏడాది మార్చిలో ఈ పనులు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది.

కృష్ణా నది వరద ముంపు ప్రాంతాల నుంచి కాపాడేందుకు మొదలుపెట్టిన రిటైనింగ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడలో కృష్ణలంక ప్రాంతం గతంలో వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురి కాలేదు. దానికి కారణం రిటైనింగ్ వాల్ నిర్మించడమే. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన రిటైనింగ్ వాల్ పనులను వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసింది. ఆ కారణంగా గతంలో కృష్ణానది వరదల నుంచి కృష్ణలంక ప్రాంతం ముంపునకు గురికాకుండా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

కృష్ణలంక ప్రాంతంలో ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మాదిరిగానే గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం, మహానాడు ప్రాంతాల్లో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు మహానాడు ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు.

ఈ ఏడాది మార్చిలో ప్రకాశం బ్యారేజీ దిగువ 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణానది కుడివైపు దిగువన ఈ రక్షణ గోడ నిర్మించేందుకు మంత్రి నారా లోకేశ్ భూమి పూజ కూడా చేశారు. రూ. 294.20 కోట్ల వ్యయంతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో నదికి కుడి వైపు ఉన్న సీతానగరం, మహానాడు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...