SBI CBO Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 186.. తెలంగాణలో 233 ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్‌ చేసుకోండి

Date:

SBI Circle Based Officer Recruitment 2025 : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India) సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వివరాల్లోకెళ్తే..

SBI CBO Circle Based Officer Recruitment 2025 : గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని  సాధించడానికి సమాయత్తమవుతున్న ఉద్యోగాలకు మంచి అవకాశం. ముంబై ప్రధాన కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న అతిపెద్ద దేశీయ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( State Bank of India ) ఇటీవల చేసిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 2,964 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (Circle Based Officer) పోస్టులను భర్తీ చేయనుంది.

ఇందులో తెలంగాణ (Telangana) రాష్ట్ర పరిధిలోని హైదరాబాద్‌ సర్కిల్‌లో 233 పోస్టులు ఉన్నాయి. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్ర పరిధిలోని అమరావతి సర్కిల్‌లో 186 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మే 29 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అప్లయ్‌ చేసుకోవడానికి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలివే:

అహ్మదాబాద్‌ పరిధిలో- 240 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో- 180 పోస్టులు, కర్ణాటక పరిధిలో- 250 పోస్టులు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పరిధిలో- 200 పోస్టులు, ఒడిశా పరిధిలో- 100 పోస్టులు, హరియాణా పరిధిలో- 306 పోస్టులు, జమ్ము అండ్‌ కశ్మీర్, లడఖ్‌, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ పరిధిలో- 80 పోస్టులు, తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలో- 120 పోస్టులు, నార్త్‌ ఈస్ట్రన్‌ పరిధిలో- 100 పోస్టులు, తెలంగాణ పరిధిలో- 230 పోస్టులు, రాజస్తాన్‌ పరిధిలో – 200 పోస్టులు, కోల్‌కతా పరిధిలో – 150 పోస్టులు, లక్నో పరిధిలో-280 పోస్టులు, మహారాష్ట్ర పరిధిలో- 250 పోస్టులు, ముంబై మెట్రో (మహారాష్ట్ర, గోవా) పరిధిలో- 100 పోస్టులు, న్యూఢిల్లీ పరిధిలో- 30 పోస్టులు, తిరువనంతపురం పరిధిలో- 90 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు- వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణలై ఉండాలి. అలాగే.. ఉద్యోగానుభం కూడా ఉండాలి. అయితే.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2025 ఏప్రిల్‌ 03 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కానీ.. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే.. జనరల్‌ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 వరకు వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం- పరీక్ష విధానం :

ఈ పోస్టులకు సంబంధించి  స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికలో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామ్‌ మొత్తం 120 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో 4 విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సెక్షన్‌లో 30 ప్రశ్నలు.. 30 మార్కులు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ సెక్షన్‌లో 40 ప్రశ్నలు.. 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/ ఎకానమీ సెక్షన్‌లో- 30 ప్రశ్నలు 30 మార్కులు, కంప్యూటర్‌ యాప్టిట్యూడ్‌ సెక్షన్‌లో 20 ప్రశ్నలు 20 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష జులై నెలలో ఉండే అవకాశం ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...