Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. e-KYC గడువు పొడిగింపు, మూడు నెలల బియ్యం ఒకేసారి

Date:

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయకపోతే రేషన్ నిలిచిపోతుందేమోనన్న ఆందోళనలో ఉన్న లబ్ధిదారులకు ఊరటనిస్తూ, e-KYC పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి వెల్లడించారు.

అంతేకాకుండా, వర్షాకాలంలో ప్రజలు తరచూ రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన ఇబ్బందిని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇంకా e-KYC పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. సమీపంలోని రేషన్ దుకాణాన్ని సంప్రదించి వెంటనే e-KYC ప్రక్రియ పూర్తి చేసుకోవడంతో పాటు, నిర్ణీత తేదీల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...