Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. e-KYC గడువు పొడిగింపు, మూడు నెలల బియ్యం ఒకేసారి

Date:

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయకపోతే రేషన్ నిలిచిపోతుందేమోనన్న ఆందోళనలో ఉన్న లబ్ధిదారులకు ఊరటనిస్తూ, e-KYC పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి వెల్లడించారు.

అంతేకాకుండా, వర్షాకాలంలో ప్రజలు తరచూ రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన ఇబ్బందిని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇంకా e-KYC పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. సమీపంలోని రేషన్ దుకాణాన్ని సంప్రదించి వెంటనే e-KYC ప్రక్రియ పూర్తి చేసుకోవడంతో పాటు, నిర్ణీత తేదీల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

వార్నీ.. ఇన్నాళ్లూ సోంపు నీళ్లను ఇంత లైట్ తీసుకున్నామా? రోజూ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయా?...

దానిమ్మతో చెడు కొవ్వుకు చెక్.. ఇలా తీసుకుంటే ప్రయోజనాలు పొందొచ్చా?

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతుందా? ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా గుండెను...

లక్షలు కాదు.. కోట్ల కిలోలు! 24 గంటల్లో భారతీయులు తినే చక్కెర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఉదయం నిద్రలేవగానే తాగే వేడి టీ నుంచి రాత్రి పడుకునే ముందు...