చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. వాటిని మాత్రం ఇవ్వలేం, ‘సారీ’ అంటూ లేఖ

Date:

కాకినాడ జిల్లా కరపలో విచిత్రమైన ఘటన జరిగింది. జులై 18న ఓ ఇంట్లో చోరీ జరిగింది.. దొంగలు బంగారం, డబ్బలు ఎత్తుకెళ్లారు. రెండు వారాల తర్వాత చోరీ చేసిన డబ్బులు, బంగారాన్ని తిరిగి అదే ఇంట్లో దొంగలు విసిరేసి వెళ్లారు. చోరీ చేయడం తప్పేనని.. కాకపోతే చోరీ చేసిన వాటిలో రూ.22వేలు వాడుకున్నామని లేఖ కూడా రాశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేమన్నారు.

ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు సారీ అంటూ లేఖ రాశారు. అలాగే దొంగతనం చేసిన బంగారం, డబ్బుల్ని తిరిగి అదే ఇంట్లో విసిరేసి వెళ్లారు. చోరీ చేసిన డబ్బుల్లో కొంత వాడుకున్నామని.. వాటిని తిరిగి ఇవ్వలేమని లేఖలో ప్రస్తావించారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కరప శివారు రామకంచిరాజునగర్‌‌లో నామాల గణేష్ నివాసం ఉంటున్నారు. జులై 18న ఆయన కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లారు.. అదే రోజు దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి రూ.6.50 లక్షల విలువైన బంగారం, రూ.50వేలు డబ్బులు తీసుకెళ్లారు. ఈ చోరీ ఘటనపై ఇంటి యజమాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆశ్చర్యకరంగా.. 15 రోజుల తర్వాత (ఆగస్టు 2న) వేకువజామున దొంగలు చోరీ చేసిన డబ్బుల్ని, బంగారాన్ని తిరిగి గణేష్ ఇంటి ఆవరణలో విసిరేసి వెళ్లిపోయారు. గణేష్ గమనించి చూడగా.. చోరీ చేసిన సొత్తు ఉంది. దొంగలు బంగారం, డబ్బులతో పాటుగా అక్కడ ఓ లేఖను కూడా విసిరారు.. ‘మేము చేసింది తప్పే, మేం రూ.22000 ఇవ్వలేం.. ఎందుకంటే అవి వాడేసుకున్నాం.. సారీ’ అని కాగితంపై రాశారు. దొంగలు చోరీ చేసిన సొమ్మును రెండు వారాలకే తిరిగి ఇంట్లోకి విసరడం చర్చనీయాంశమైంది. దొంగలు నిజాయితీగా రూ.22వేలు మాత్రమే వాడుకున్నామని చెప్పి మిగిలిన సొత్తు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. రూ.22వేలు పోయినా బంగారంతో పాటుగా మిగిలిన డబ్బులు దక్కాయని గణేష్ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా కొన్ని చోరీ కేసుల్లో దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తును తిరిగి తీసుకొచ్చిన ఘటనలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...