
వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు. 72 ఏళ్ల వయసులో యూరప్లోనే అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ వెస్ట్ పీక్ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 5,642 మీటర్ల ఎత్తైన ఈ మంచు శిఖరాన్ని ఆగస్టు 14న తన 17 ఏళ్ల మనవడు పోకూరి అనురాగ్తో కలిసి అధిరోహించారు.
తాతా, మనవడు కలిసి ఎల్బ్రస్ వెస్ట్ పీక్తో పాటు ఈస్ట్ పీక్ను కూడా అధిరోహించడం విశేషం. ఈ సాహసయాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రవీంద్రరావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
72 ఏళ్ల వయసులోనూ మంచు పర్వతాన్ని అధిరోహించేంత ఫిట్నెస్ కొనసాగించడం అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే వయసుతో సంబంధం లేకుండా సాహసాలు చేయవచ్చని రవీంద్రరావు నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే.. అనురాగ్ ప్రముఖ నిర్మాత, ఈతరం ఫిల్మ్ అధినేత పోకూరి బాబూరావు మనవడు. తాత, మనవడు కలిసి చేపట్టిన ఈ సాహసయాత్ర పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

