ఏపీలో ఈవీ వాహనాలు కొనుగోలు చేసినవారికి సూపర్ న్యూస్.. కొత్తగా 500 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘సర్వోటెక్‌’ సంస్థ ఈ విషయంలో కీలక పాత్ర పోషించనుంది. పెట్రోల్ బంకులు, హోటళ్లలో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు రానున్నాయి. కొత్తగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇటీవలి కాలంలో ఈవీ వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగాయి. అయితే ఈవీ వాహనాలను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నెడ్‌క్యాప్ (NEDCAP) నిర్ణయించింది. ఈ ప్రణాళికలకు అనుగుణంగా ఢిల్లీకి చెందిన ‘సర్వోటెక్‌’ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థ పెట్రోల్ బంకులు, స్టార్ హోటళ్లలో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సులకు అవసరమైన ఛార్జింగ్ సౌకర్యాలను కల్పించడానికి నెడ్‌క్యాప్‌తో చర్చలు జరుపుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు..

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ...

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి...

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు...

ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్..

ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో,...