
ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో నూతన మార్పులు తెస్తున్నారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. ప్రత్యేక డిజైన్, ప్రపంచ స్థాయి వసతులతో పాఠశాలలు ఏర్పాటు చేయడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలో పైలట్ ప్రాజెక్టు కోసం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం నిడమర్రు పాఠశాల పనులు శరవేగంగా సాగుతున్నాయి
