
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని, పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జూబ్లీహిల్స్లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ డ్రోన్ల ద్వారా పోలింగ్ పరిస్థితిని పర్యవేక్షించారు. దేశంలోనే తొలిసారి 150 డ్రోన్ కెమెరాలతో పోలింగ్ కేంద్రాల భద్రతను పరిశీలిస్తున్నామని తెలిపారు. మొత్తం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని సీపీ పేర్కొన్నారు
