
యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్లో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నికలో 48.49 శాతం ఓటింగ్ నమోదు కాగా… మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా బోరబండ డివిజన్లో 55.92 శాతం, అత్యల్పంగా సోమాజిగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ 10 రౌండ్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం
