
రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు, ముఖ్యంగా వలస వెళ్లినవాళ్లు ఇంకా కార్డులు తీసుకోలేదు. అనకాపల్లి మండలంలోనే వేలాది కార్డులు మిగిలిపోయాయి. ఈ నెల 30 లోపు కార్డులు తీసుకోకపోతే అవి రద్దు అవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ప్రతి ఐదేళ్లకోసారి ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేదంటే పథకాలు ఆగిపోతాయని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త స్మార్ట్ కార్డులను మూడు నెలల క్రితం జారీ చేసింది. గ్రామ సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ల పర్యవేక్షణలో ఈ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే మూడు నెలలు గడిచినా వేలాది కార్డులను లబ్ధిదారుల తీసుకోలేదు. ప్రధానంగా వలస వెళ్లిన లబ్ధిదారులకు కార్డులు తీసుకోవడం కష్టంగా మారింది. అలాగే మరికొందరు కూడా కార్డులు తీసుకోలేదు. దీనివల్ల వేలాది కార్డులు ఇంకా పంపిణీ కాకుండానే ఉండిపోయాయి
