
సరోజ భారీ విరాళం అందజేశారు. ఆమె ఏకంగా రూ.1.25 కోట్లు విరాళం ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎంతో మేలు చేస్తోంది. కార్తీక మాసంలో లక్షలాది మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని శ్రీశైలం, మహానంది వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి భారీగా లబ్ధి పొందారు
నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో నూతనంగా నందీశ్వర సదనం నిర్మిస్తున్నారు. మహానంది దేవస్థానం ఆధ్వర్యంలో రూ.10.50 కోట్ల వ్యయంతో నందీశ్వర సదనం నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణానికి పలువురు భక్తులు ముందుకొచ్చి విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా నందీశ్వర సదనం మొదటి అంతస్తు నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన భక్తురాలు, NRI సరోజ భారీ విరాళం అందజేశారు. సరోజ ఏకంగా రూ.1.25 కోట్లు నందీశ్వర సదనం నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు.
