ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,46,510కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,34,300 వద్ద ట్రేడవుతోంది.

అలాగే కిలో వెండి ధర రూ.5,000 పెరిగి హైదరాబాద్‌లో రూ.2,45,000కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,40,000గా నమోదైంది.