ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.7వేలు జమ, అర్హులైన రైతులు చనిపోతే ఇలా చేయండి

Date:

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. అర్హులైన 46 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ కానున్నాయి. ఆధార్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ స్టేటస్ తెలుసుకుని, మీ సేవ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకం కింద మొత్తం రూ.20 వేలు అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు విడుదలపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత – సుఖీభవ’ రెండో విడత నిధుల విడుదలకు సన్నద్ధం అవుతుండగా.. అధికారులతో ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 19న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర వాటా కింద రూ.5 వేలు, కేంద్రం వాటా కింద రూ.2 వేలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో నిధులు విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ‘అన్నదాత – సుఖీభవ’ కింద రెండో విడతలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...