
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో పాసవ్వాలని లక్షలాది మంది నిరుద్యోగులు కలలు కంటారు. అయితే, అతికొద్ది మంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకోగలుగుతారు. సివిల్స్ సన్నద్ధతకు ఖర్చు ఎక్కువ కావడంతో పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు తమ కోరికను తీర్చుకోలేకపోతున్నారు. అలాంటి అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ పథకానికి అవసరమైన నిధులను భరిస్తోంది. పూర్తి వివరాలు.
సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధించాలని లక్షలాది మంది నిరుద్యోగులు కలలు కంటారు. కానీ, వారిలో సగం మంది యూపీఎస్సీ పరీక్షలు కూడా రాయలేకపోతుంటారు. సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమయ్యేందుకు అయ్యే ఖర్చును భరించే స్తోమత లేక ఏటా వేలాది మంది తమ కోరికను చంపుకుంటారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ సివిల్ సర్వీసెస్ కోరికను చంపుకోవద్దనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం.
UPSC సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల శిక్షణ కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ. 1 లక్ష అందిస్తారు. మెయిన్స్లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులకు మరో లక్ష రూపాయల సాయం అందిస్తారు. సింగరేణి కాలరీస్ సంస్థ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ముఖ్య వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

